తృణమూల్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ ఇవాళ లోక్సభలో పచ్చి వంకాయను కొరికారు. ధరల పెరుగుదల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఇలా చేశారు. ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించినందుకు థ్యాంక్స్ చెప్పిన ఆమె చాలా సమయం తర్వాత ఈ అంశంపై డిబేట్ జరిగిందన్నారు. వంట గ్యాస్ ధరలు బాగా పెరిగిపోయాయని, వంటను ఎలా వండుకోవాలని, మేం పచ్చి కూరగాయలు తినాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఆమె తన చేతుల్లో ఉన్న పచ్చి వంకాయను కొరికేశారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఎంపీ దస్తీదార్ డిమాండ్ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో ఎల్పీజీ సిలిండర్ ధర నాలుగు సార్లు పెరిగిందని, రూ.600 నుంచి రూ.1100కు పెరిగినట్లు ఆమె చెప్పారు.
వంకాయను కొరికిన తృణమూల్ ఎంపీ ?
August 01, 2022
0
Tags