ఎన్టీఆర్ చిన్నకూతురు హఠాన్మరణం !

Telugu Lo Computer
0


దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూతురు అకస్మాత్తుగా మరణించారు. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది.  పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు. ఎన్టీఆర్‌కు మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, నలుగురు కూతుర్లు. వీళ్ళలో హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం తెలిసిందే. కూతుళ్లు భువనేశ్వరి, పురంధేశ్వరి గురించి కూడా మనకు తెలుసు. ఎన్టీఆర్ మరో కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరి. 

Post a Comment

0Comments

Post a Comment (0)