ఇండోనేషియాలోని వెస్ట్ పాపువా ప్రావిన్స్లో తెలుక్ బింటునీకి చెందిన నిర్మాణ కార్మికుడు యెనిమాన్ బెర్నార్డ్ సముద్ర తీరంలో ఈత కొట్టిన అనంతరం పడవపై కూర్చుని ఉండగా ఓ 13 అడుగుల మొసలి వచ్చి అతడిని నీటిలోకి లాగి అమాంతం మింగేసింది. జూన్ 28 న ఈ సంఘటన జరిగింది. దీంతో అతడి ఆచూకి కోసం సముద్రంలో వెతికారు. కనిపించకపోయే సరికి మొసలే మింగేసి ఉంటుందని భావించారు. ఆగ్రహించిన స్థానికులు దాని కోసం సముద్రంలో వేట మొదలెట్టారు. జూన్ 29 సాయంత్రం ఉబ్బిన కడుపుతో భారీ మొసలి ఒకటి వారికి కనిపించింది. దీంతో అదే మనిషిని మింగేసి ఉంటుందని భావించిన వారు దాన్ని బంధించి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఒక కత్తిని ఉపయోగించి దాని పొట్టను చీల్చగా వారు ఊహించిందే జరిగింది. లోపల దాదాపుగా జీర్ణం అయిన మానవ అవశేషాలు కనిపించాయి. మొసలి పొట్ట లోపల ఉన్న మనిషి బాడీ మిస్సైన వ్యక్తిదే అని స్థానిక పోలీసు అధికారి రెసిహోల్ లింబాంగ్ ధృవీకరించారు. అయితే అధికారికంగా కన్ఫామ్ చేయడానికి… మొసలి కడుపులో ఉన్న ఒక పుర్రె, కొన్ని ఎముకలను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.
మనిషిని మింగిన మొసలి !
July 12, 2022
0
Tags