బుక్ లెట్ లో పేర్కొన్న పదాలనే పార్లమెంట్ లో వాడుతా !

Telugu Lo Computer
0


జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ, రాజ్య సభల్లో కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ తాజాగా కొత్త బుక్ లెట్ ను విడుదల చేసింది. జుమ్లాజీవి, కొవిడ్ స్ర్పైడర్, స్నూప్ గేట్ వంటి పదాలు కూడా ఉన్నాయి. అంతేకాక సాధారణంగా వాడే సిగ్గుచేటు, వేధించడం, మోసగించడం, అవినీతిపరుడు, డ్రామా, హిపోక్రసీ, నియంత అనే పదాలతో పాలు మరికొన్ని పదాలను ఉపయోగించవద్దని బుక్ లెట్ లో పేర్కొంది. బుక్ లెట్ లో పేర్కొన్న పదాలను వాడకూడదనే సూచలను వెలువడిన అంశంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పదాలు వాడకూడదు అని సూచలను ఆయన ఖండించారు. సాధారణ పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాలుగా పేర్కొనడం సరికాదని..తాను మాత్రం 'సాధారణ' పదాలను సభలో ఉపయోగిస్తానని స్పష్టం చేస్తూ..కావాలంటే లోక్ సభ స్పీకర్ నన్ను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. జులై 18 నుంచి జరిగే లోక్ సభ, రాజ్య సభ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు కొన్ని పదాలు వాడకూడదంటూ లోక్ సభ సెక్రటేరియట్ బుధవారం ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. ఈ అంశంపై ఎంపీ డెరెక్ అసహనం వ్యక్తంచేశారు. ఆ ఆదేశాలను ధిక్కరిస్తానని కావాలంటే తనను సభ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ ట్వీట్ చేశారు. పార్లమెంటులో మాట్లాడుతున్న సమయంలో కొన్ని పదాలు వస్తుంటాయనీ..’సిగ్గుపడుతున్నాను.. దుర్వినియోగం చేశారు.. ద్రోహం చేశారు.. అవినీతిపరుడు.. వంచన.. అసమర్థుడు’ వంటి పదాలను ఉపయోగించడానికి మాకు అనుమతి లేదట.. కానీ నేను ఈ పదాలన్నింటినీ ఉపయోగిస్తాను.కావాలంటే నన్ను సస్పెండ్ చేయండి. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటా'’ అని ఎంపీ డెరెక్ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)