టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో వాటర్ బాటిళ్లు !

Telugu Lo Computer
0


టీఎస్ ఆర్టీసీ సేవలను అభివృద్దిలోకి తీసుకురావటం కోసం ఎండీ సజ్జనార్ ఇప్పటికే పలు రకాల కొత్త విధానాలను అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ఏసీ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు మంచి నీటి సీసాలతోపాటు, ముఖాన్ని తుడుచుకునేందుకు ఫేస్ ఫ్రేస్ ఫ్రెషనర్లను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సేవలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశిస్తూ, ఆయన సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. "టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే వారికే ఈ సౌలభ్యాన్ని కల్పించనున్నాం. గతంలో దూర ప్రాంతాల ఏసీ బస్సు ప్రయాణికులకు మంచినీటి సీసాను అందించే వారు. కానీ, కొద్దిరోజులుగా ఆ విధానాన్ని అప్రకటితంగా నిలిపివేశారు. దూరం, మార్గంతో సంబంధం లేకుండా ఏసీ బస్సుల్లో ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాం. ఏసీ బస్సుల్లో డ్రైవర్లతోపాటు వ్యక్తిగత ఆటెండెండర్‌కు కూడా ఈ నీళ్ల సిసాలను ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం." అని క్షేత్రస్థాయి అధికారులకు సజ్జనార్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)