నరేష్ కు కృష్ణ మందలింపు ?

Telugu Lo Computer
0



నటి పవిత్ర లోకేష్ ని నాల్గవ పెళ్లి చేసుకోబోతున్న వ్యవహారం పెద్ద వివాదాలకు దారి తీసింది. నరేష్ మూడవ భార్య రమ్య మీడియా కి వచ్చి నరేష్ పై ఆరోపణలు చెయ్యడం ఆ తర్వాత నరేష్ దానికి కౌంటర్లు ఇవ్వడం , ఇలా ఇప్పటికి వీరి వివాద వ్యవహారం మీడియా లో కొనసాగుతూనే ఉంది. ఇటీవల నరేష్ - పవిత్ర లోకేష్ బెంగళూరు లో నివాసం ఉంటున్న ఒక హోటల్ రూమ్ కి రమ్య వెళ్లి ఇద్దరినీ చెప్పుతో కొట్టబోయింది  అక్కడ ఉన్న పోలీసులు ఆమెని అదుపు చెయ్యడం వల్ల పరిస్థితులు శాంతించాయి కానీ లేకపోతే ఆరోజు పెద్ద గొడవే జరిగేది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యింది.  నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉన్న ఈ వివాదం ని చూసి సూపర్ స్టార్ కృష్ణ నరేష్ పై ఫైర్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్నఈ వ్యవహారం మొత్తం ఘట్టమనేని ఫామిలీ కుటుంబం పరువు తీసేలా ఉందని, వివాదాలకు దూరంగా ఉండే కుటుంబం పరువు తియ్యొదు, ఇక నుండి ఎలాంటి వీడియో బైట్స్ కానీ, ప్రెస్ మీట్లు కానీ పెట్టొద్దు అంటూ కృష్ణ గారు నరేష్ ని గట్టిగా మందలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..అందుకే తన నాల్గవ పెళ్లి వివాదం గురించి ఈమధ్య కాలం లో మాట్లాడడం  మానేసాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)