మహిళపై అత్యాచారం

Telugu Lo Computer
0


బీహార్ లోని కటిహార్ జిల్లాలో 45 ఏళ్ల మహిళ భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తుండగా మహిళ 11 ఏళ్ల కూతురితో కలిసి నిద్రిస్తుంది. అదే సమయంలో పొరిగింటిలో ఉంటున్న మొహమ్మద్ షమీమ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళను ఎత్తుకుపోయాడు. రేప్ కు పాల్పడుతుండగా జరిగిన పెనుగులాటలో మేకు లాంటి వస్తువుతో ఆమె కళ్లలో పొడిచాడు. స్థానికులు ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె రెండు కళ్లకు గాయం కాగా,  పరీక్షల అనంతరమే చూపు గురించి చెప్పగలమని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కటిహార్ లోని సదర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఆమె రెటీనా డామేజ్ అయిందని, పత్తి సంచులు కుట్టే సూది లాంటి దానితో దాడి చేసి ఉండొచ్చని.. ఆమెకు చూపుకు రావడం కష్టమని తేల్చారు. మెడికల్ టెస్టుల అనంతరం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)