ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని సిక్కు గురుద్వారా వద్ద పేలుడు జరిగింది. కార్తే పర్వాన్ గురుద్వారా మెయిన్ గేట్కు సమీపంలో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది. పేలుడులో భారతీయులెవ్వరూ గాయపడలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చెప్పారు. పేలుడుకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చెరలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడి సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. దీంతో అనేక మంది సిక్కులు భారత్కు వలస వస్తున్నారు. కాబూల్ సిక్కు గురుద్వారా వద్ద పేలుడు ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆరా తీసింది.
కాబూల్లో సిక్కు గురుద్వారా వద్ద బాంబు పేలుడు
July 27, 2022
0
Tags