పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్ నాకా పార్టీ (చెక్పోస్ట్)పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ ఆదివారం మధ్యాహ్నం మరణించారు. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని గోంగూ క్రాసింగ్ సమీపంలో ఈ దాడి జరిగింది. సమీపంలోని యాపిల్ తోట నుండి చెక్పోస్ట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ అధికారి గాయనడినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. గాయపడిన అధికారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులను కనుగొని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మృతి
July 17, 2022
0
Tags