కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బైందూర్ సమీపంలో ఉన్న బిజూర్ గ్రామానికి చెందిన సమన్వి (6) అనే చిన్నారి వివేకానంద స్కూల్లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం చిన్నారి స్కూల్కు వెళ్లడానికి మారాం చేయడం తో తల్లిదండ్రులు చిన్నారికి నచ్చజెప్పి చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ను ఆ చిన్నారి తింటున్న సమయంలో స్కూల్ బస్ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి, ఒక్కసారిగా చాక్లెట్ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్ బస్ డోర్ వద్ద కుప్పకూలింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కళ్ల ముందే తమ బిడ్డ చనిపోవడం తో ఆ తల్లిందండ్రులు విలవిలాడారు.
ప్రాణం తీసిన చాక్లెట్ !
July 21, 2022
0
Tags