ప్రాణం తీసిన చాక్లెట్ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బైందూర్​ సమీపంలో ఉన్న బిజూర్​ గ్రామానికి చెందిన సమన్వి (6) అనే చిన్నారి వివేకానంద స్కూల్​లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం చిన్నారి స్కూల్​కు వెళ్లడానికి మారాం చేయడం తో తల్లిదండ్రులు చిన్నారికి నచ్చజెప్పి చాక్లెట్​ ఇచ్చారు. చాక్లెట్​ను ఆ చిన్నారి తింటున్న సమయంలో స్కూల్​ బస్​ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి, ఒక్కసారిగా చాక్లెట్​ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్​ బస్​ డోర్​ వద్ద కుప్పకూలింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కళ్ల ముందే తమ బిడ్డ చనిపోవడం తో ఆ తల్లిందండ్రులు విలవిలాడారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)