ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే

Telugu Lo Computer
0


ట్రైన్‌ వచ్చేది గమనించక తన సామగ్రితో పట్టాలు దాటి మళ్లీ తిరిగి వచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. ఆ సమయంలోనే ట్రైన్‌ దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐఏఎస్‌ అధికారి అవనీశ్‌ శరన్ ఈ దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 'ఈ జీవితం మీది.. నిర్ణయమూ మీదే' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ వీడియోలో.. స్టేషన్‌కు ముందే నిలిపేసిన ట్రైన్‌ నుంచి కొందరు ప్రయాణికులు దిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీడియో తీస్తున్న వ్యక్తి పక్క ట్రాక్‌పై మరో ట్రైన్‌ వస్తుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. పట్టాలకు అవతలివైపు తమ లగేజీని పడేసిన ఓ మహిళ మళ్లీ తిరిగి ఈ వైపునకు వచ్చే ప్రయత్నం చేసింది. రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఇలాంటి సాహసాలకు పాల్పొడొద్దని, అది అంత మంచిది కాదని ప్రజలకు సూచించారు ఐఏఎస్‌ అధికారి. నెటిజన్లు సైతం ఆ మహిళ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివితక్కువ ప్రయాణికులు అంటూ ఓ వ్యక్తి పేర్కొన్నారు. సొంత జీవితాన్ని ప్రమాదంలో పడేసే ఆత్రుత ఎందుకు? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు. మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఆ వీడియో రెండు లక్షలకు పైగా మంది చూశారు. అయితే.. ఇది ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు.


ఇదీ :

Post a Comment

0Comments

Post a Comment (0)