గుజరాత్లోని సురేంద్ర నగర్ జిల్లా గజన్వావ్ గ్రామంలో మనీషా అనే 12 ఏళ్ళ బాలిక ఇవాళ ఉదయం 7.30 గంటలకు బోరు బావిలో పడిపోయింది. ఆ బోరు బావి దాదాపు 500 నుంచి 700 అడుగుల లోతు ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి ఆర్మీ జవాన్లతో పాటు పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని, దాదాపు 5 గంటల పాటు కష్టపడి ఆ బాలికను సురక్షితంగా బయటకు తీశారు. సహాయక చర్యల్లో భాగంగా బోరుబావిలోని బాలికకు ఆక్సిజన్ కూడా పంపినట్లు వివరించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని కెమెరా ద్వారా పరిశీలించామని చెప్పారు. బోరుబావిలోంచి ఆమెను తీసిన అనంతరం ధృంగాధ్రలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ధృంగాధ్రలోనే రెండు నెలల క్రితం రెండేళ్ళ బాలుడు బోరుబావిలో పడ్డాడు. అతడిని కూడా ఆర్మీ జవాన్లు మూడు గంటల్లో బయటకు తీశారు.
బోరుబావిలో పడ్డ బాలికను రక్షించిన జవాన్లు
July 29, 2022
0
Tags