42 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్

Telugu Lo Computer
0


ఇండోనేషియాకు చెందిన 42 ఏళ్ల సీరియల్ కిల్లర్ అహ్మద్ సుదార్జీ  తన మాయమాటలతో యువతులను ఆకట్టుకునేవాడు. తన మూఢనమ్మకాలతో ఆ యువతులను హత్య చేశాడు. 14 ఏళ్ల క్రితం అంటే 2008లో ఈ హత్యలకు మరణశిక్ష విధించినప్పుడు.. అతను తన నేరాన్ని అంగీకరించాడు. తాను 42 మంది మహిళలను, బాలికలను హత్యలు చేసినట్లు కోర్టులో తెలిపారు. ఇందులో 11 మంది మైనర్ బాలికలు కూడా ఉన్నారు. సురద్జీని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ తిన్నారు. ఒక రోజు కలలో తన తండ్రి ఆత్మ కనిపించిందని, 70 మంది మహిళల లాలాజలం తాగితే, తాను మంచి తాంత్రికుని కాగలనని తన తండ్రి చెప్పినట్లు చెప్పాడు. తండ్రి ఆత్మ చెప్పిన మాటను విని సురద్జీ హత్యలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. స్త్రీ లాలాజలం తాగడానికి .. తాను గొప్ప తాంత్రికుడిగా మారడానికి చాలా సమయం పడుతుందని సుదర్జీ భావించాడు. అప్పటి నుంచి స్త్రీలను చంపి వారి లాలాజలం తాగడం మొదలుపెట్టాడు. ఇందుకు తన దగ్గరకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం వచ్చే మహిళలను ఎంచుకున్నాడు. తన దగ్గరకు వచ్చే మహిళలకు మెరుగైన జీవితం కోసం యాగం చేయాలని భావిస్తున్నారని విచారణ సందర్భంగా సుదర్జీ చెప్పాడు. తన దగ్గరకు వచ్చిన మహిళలను చెరుకు తోటకు తీసుకెళ్లి నడుము వరకు పూడ్చిపెట్టేవాడినని, ఇది ఆచారంలో భాగమని, అందుకే భయాందోళన చెందవద్దని, మహిళలు నిలదొక్కుకోగానే గొంతు నులిమి హత్య చేసినల్టు విచారణలో చెప్పాడు. అనంతరం వారి లాలాజలం తాగేవాడినని చెప్పాడు. మీడియా కథనాల ప్రకారం 1997 సంవత్సరంలో 21 ఏళ్ల మహిళ మృత దేహం పొలంలో శవమై కనిపించడంతో సుదార్జీ హత్యలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితం సుదార్జీ వద్ద వదిలి వెళ్లిన మహిళ కనిపించకపోవడంతో చేపట్టిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సురద్జీ మొదట్లో పోలీసులు విచారణకు సహకరించలేదు. దీంతో అధికారులు కాస్త కఠినత పెంచే సరికి చిలుక పలుకులు పలికినల్టు హత్యలు చేసిన సంగతి.. ఎలా ఎప్పుడు హత్య చేశాడో అన్ని చెప్పాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)