దేశంలో కొత్తగా 19,673 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,673 మందికి కొవిడ్ సోకింది. వైరస్ భారీన పడిన మరో 45 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5 లక్షల 26 వేల 357కు పెరిగింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 20 వేల మందికి పైగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,33,49,778కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం ప్రమాదకరంగా మారింది. 5.05 శాతానికి చేరినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,43,676 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 31,36,029 మందికి వ్యాక్సినే వేశారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 203.94 కోట్లు దాటింది.

Post a Comment

0Comments

Post a Comment (0)