దేశంలో కొత్తగా 16,935 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,935 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 5,25,760 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 1,44,264 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 51 మంది కరోనా వైరస్ సోకి చనిపోగా, 16,069 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారీ పాజిటివిటీ 6.48 శాతానికి పెరిగిందని వెల్లడించింది. 0.33 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.47 శాతం కాగా, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 200 కోట్ల 4 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)