భార్య మీద మోజు తీరిడంతో....!

Telugu Lo Computer
0


కర్ణాటకలోని  మండ్యలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వీరికి  ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టిన తరువాత భార్య మీద మోజు తగ్గిపోవడంతో భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యాపారం చేస్తున్న భర్త వ్యాపారం పనిమీద బయట ఊరికి వెలుతున్నానని భార్యకు మాయమాటలు చెప్పి ప్రియురాలి ఇంటికి వెళ్లేవాడు. భర్త అక్రమ సంబంధం విషయం అతని భార్యకు తెలియడంతో  ఆ విషయాన్ని పెద్దలకి చెప్పింది. పెద్దలు పంచాయితీలు చేసినా భర్త మాత్రం నాకు నా ప్రియురాలు కావాలని బెట్టు చేశాడు. భార్యను పుట్టింటికి తరిమేసి ప్రియురాలితో జీవితాంతం సుఖంగా ఉండాలని భర్త స్కెచ్ వేశాడు. రాత్రి ఇదే వియషంలో దంపతుల మద్య గొడవ జరిగింది. కన్నబిడ్డల ఎదురుగానే కట్టుకున్న భార్యను చంపేశాడు. ఈ విచారణఫై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. 

Post a Comment

0Comments

Post a Comment (0)