దేశంలో కొత్తగా 16,906 కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 16,906 మందికి కొవిడ్ సోకింది. దీంతో ఇప్పటివరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 4,36,69,850కి చేరుకుంది. ఇక నిన్నటితో పోల్చితే 24.2శాతం ఎక్కువగా కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,32,457కి చేరాయి. మంగళవారం ఒక్కరోజే కొవిడ్ తో చికిత్స పొందుతూ 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5,25,519కి చేరుకుంది. మంగళవారం 15,447 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రెండేళ్ల కాలంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.36 కోట్ల (98.49 శాతం)కు చేరింది. ప్రధాన నగరాల్లో కోవిడ్ కేసుల వివరాలు చూస్తే.. గడిచిన 24గంటల్లో ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 2,659 కేసులు, మహారాష్ట్రలో 2,435 కేసులు, తమిళనాడులో 2,280 కేసులు, కేరళలో 2,211 కేసులు, కర్ణాటకలో 891 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి దాదాపు 61.97 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోనే 15.73 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజు 11,15,068 డోస్‌లు వైద్య సిబ్బంది అందించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డోస్‌ల సంఖ్య 1,99,12,79,010కి చేరుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)