మహారాష్ట్రలోని వసాయ్లో భారీ వర్షాల కారణంగా బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు. వాసాయిలోని వాగ్రపాడు ప్రాంతంలోని ఓ ఇంటిపై కొండచరియల శిథిలాలు పడ్డాయి.రెస్క్యూ అధికారులు నలుగురిని రక్షించారు. మరో ఇద్దరు ఇప్పటికీ శిధిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
మహారాష్ట్రలో విరిగిపడిన కొండచరియలు
July 13, 2022
0