విదేశీ విరాళాల పరిమితి 10 లక్షలకు పెంపు !

Telugu Lo Computer
0


హోంమంత్రిత్వ శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు చేసింది. విదేశాల్లో ఉన్నవారి నుంచి భారత్‌లో ఉన్నవారు ఏడాదికి 10 లక్షల వరకు నగదు అందుకోవచ్చు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం, వివరాలు సమర్పించనక్కర్లేదు. గతంలో ఈ పరిమితి ఒక లక్షగా ఉండేది. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు పెంచారు. అంతేకాదు, ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఈ మేరకు కేంద్ర హోంమత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఫ్ సీఆర్ఏలోని రూల్ 6లో మార్పులకు ఆమోదం తెలుపుతున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)