కేంద్రంపై రైతు సంఘం ఉద్యమ కార్యాచరణ !

Telugu Lo Computer
0


జాతీయ స్థాయి రైతు సంఘాల సమావేశాన్ని ఢిల్లీలో రాకాబ్ గంజ్ గురుద్వార్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ కిసాన్ మహా సంఘ్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను ఉపసంహరణ చేసే క్రమంలో ఇచ్చిన హామీలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం హామీని నెరవేర్చని నేపథ్యంలో ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి రైతు సంఘాలతో చర్చలు జరిపారు. దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు ఉద్యమ కార్యాచరణకు తమ వంతు సహకారాన్ని అందించనున్నట్లు కోటపాటి నరసింహం నాయుడు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్నా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మొత్తం ధాన్యం సేకరణ అంశాలను సమావేశంలో కోటపాటి నరసింహం నాయుడు వివరించారు. ఇతర రాష్ట్రాలలో కూడా తెలంగాణ మోడల్ రైతు పథకాల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సమావేశం తీర్మానించింది. అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రవేశపట్టిన తీర్మానాన్ని రైతు సంఘాల నేతలు ఆమోదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)