ట్రక్ టైర్ ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ మృతి

Telugu Lo Computer
0


తమిళనాడులో ఆటో డ్రైవర్‌ను ట్రక్ టైర్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అతివేగంతో దూసుకెళ్తున్న ట్రక్ నుంచి టైర్ విడిపోయి రోడ్డు పక్కన నిలబడిన 45ఏళ్ల ఆటో డ్రైవర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన అతడు కొన్ని మీటర్ల దూరంలో పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 45 ఏళ్ల వ్యక్తిని ట్రక్కు నుంచి టైర్ విడిపోయి అతివేగంతో అతనిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడు అక్కడే మృతిచెందాడు. మృతుడు శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్న మురళిగా పోలీసులు గుర్తించారు.  కిరాణా సామాన్లు కొనుగోలు చేసి మురళి తన ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టైర్ ఢీకొట్టిన అనంతరం కిందపడిన మురళిని పాదచారులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అప్పటికే మురళి మృతి చెందాడు. ఘటన సంబంధించి సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. మురళి దుకాణం సమీపంలో నడుచుకుంటూ వెళ్తూ ఆగి చొక్కా జేబులో చూసుకుంటుండగా వెనుక నుంచి టైరు ఢీకొట్టింది. టైర్ బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడే రోడ్డు దాటిన మరో పాదచారికి ఈ టైరు మీదకు దూసుకొచ్చింది. అతడు తప్పించుకున్నాడు. పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)