ఆన్ లైన్ రమ్మీకి బానిసై ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య !

Telugu Lo Computer
0

 

తమిళనాడులోని  చెన్నై, మణలి పుదునగం కి చెందిన భాగ్యరాజ్ఆ రేళ్ల కిందట భవానీని పెళ్లి చేసుకున్నాడు. భాగ్యరాజ్ ప్రైవేట్ కంపెనీలోను, భవానీ ఐటీ సంస్థలోనూ పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. భవానీ ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారడంతో కుటుంబ సభ్యుల దగ్గర ఆరు నెలల కిందట రూ.3 లక్షలను అప్పుగా తీసుకుంది. అక్కడితో ఆగకుండా తన దగ్గరున్న 20 సవర్ల బంగారు నగలను కూడా తాకట్టు పెట్టింది. అప్పుగా తీసుకున్న మొత్తంతోపాటు, బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో ఆన్ లైన్ రమ్మీ ఆడింది. కానీ అందులో నష్టాలు వచ్చాయి. ఆమె తీరుపై భర్తతోపాటు, తల్లిదండ్రులు కూడా ఆగ్రహించినా భవానీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. దీంతో ఆదివారం రాత్రి స్నానానికి అని వెళ్లిన భవానీ బాత్రూమ్ లోనే ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)