మణిపుర్లోని నోనే జిల్లా తుపుల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.ఇప్పటివరకు 19 మందిని రక్షించాం. క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఆర్మీ అధికారులు తెలియజేశారు. ఈ ఘటనలో మొత్తం 45 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్ ఘటనపై మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి బలగాలు. వైద్యులతో సహా అంబులెన్సులను ఘటనా స్థలికి చేరుకున్నాయని మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ తెలిపారు.
ఆర్మీ క్యాంప్పై విరిగిపడిన కొండచరియలు
June 30, 2022
0
Tags