ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన బీఎస్పీ

Telugu Lo Computer
0


బీఎస్పీ చీఫ్‌ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్తారని తెలిపారు.ఈ నిర్ణయం బీజేపీ, ఎన్‌డిఎకు మద్దతుగా లేదా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా తీసుకోలేదని మాయావతి స్పష్టంచేశారు. మా పార్టీని,మా సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని 'ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని తాము నిర్ణయించాం అని తెలిపారు. తాము బీజేపీకి గానీ, ఎన్డీయేకి గానీ మద్దతు ఇవ్వడంలేదని తెలిపారు. అలాగని ప్రతిపక్షాలకూ వ్యతిరేకం కాదు. పార్టీ విధానాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం' అని మాయావతి చెప్పారు. కాగా..మద్దతు అంశంపై ప్రతిపక్షాలు తమను సంప్రదించలేదని వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)