సీనియర్ సిపిఎం నేత, కేరళ మాజీ ఆర్థిక శాఖ మంత్రి టి.శివదాసా మీనన్ (90) మృతి చెందారు. వయసు రీత్యా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కోజికోడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారని ఆ వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఆయన అంత్యక్రియలు మంజేరీలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. మన్నార్కడ్లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన ఉపాధ్యాయ సంఘాల నిర్వహణ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ రంగంలో పలు పదవులను నిర్వహించిన అనంతరం సిపిఎంలో ప్రముఖ నేతగా ఎదిగారు. 1987, 1991, 1996లో పాలక్కాడ్ జిల్లాలోని మలప్పుజా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 1987-1991లో ఇ.కె.నాయనార్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వంలో విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అనంతరం నాయనార్ కేబినెట్లో 1996-2001లో ఆర్థిక శాఖ మంత్రిగా ఐదేళ్లు కొనసాగారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగాను పనిచేశారు.
సిపిఎం నేత టి.శివదాసా మీనన్ మృతి
June 28, 2022
0