తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయానికి ప్రతిరోజూ షార్జా, సింగపూరు తదితర విదేశాల నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి తదితర నగరాల నుంచి విమానాల్లో వేలాదిమంది ప్రయాణికులు వస్తున్నారు. రోజూ 20కి పైగా విమానాలు నడుపుతున్నారు. ఈ విమానాల్లో వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం నడుపుతున్నారు. ఆ కేంద్రానికి సెల్ఫోన్ ద్వారా ప్రయాణికులు సంప్రదించి తమకు కావాల్సిన సమాచారాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రత్యేక సేవలందించేందుకు ఇన్గేట్ సమీపంలో ఒకటి, అవుట్గేట్ సమీపంలో ఒకటి ఆటోమేటిక్ రోబోను ఏర్పాటు చేశారు. ఈ రోబోలు ఎవరి సాయం లేకుండానే కదలుతాయి. విమానం నుంచి దిగి వస్తున్న ప్రయాణికులకు ఈ రోబోలు స్వాగతం పలుకుతాయి. అదే సమయంలో ప్రయాణికులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తాయి. అంతే కాకుండా ప్రయాణికులు విమానం ఎక్కేందుకు వెళ్లే మార్గం గురించి, పాస్పోర్ట్లో తనిఖీ చేసే కేంద్రం ఉన్న ప్రాంతం గురించి ప్రకటనలు చేస్తుంటాయి.
కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో 'రోబో' సేవలు
June 10, 2022
0
Tags