దేశంలో మళ్లీ కరోనా కలకలం రేపుతున్నది. మరోసారి కరోనా వైరస్ విజృంబిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కరోనా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు అవలంబించాల్సిన పద్ధతులు వంటి ఐదంచెల వ్యూహాన్ని అనుసరించి వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచించింది.
నాలుగు రాష్ట్రాల్లో ఐదంచెల వ్యూహంపై సూచన
June 09, 2022
0