అంధురాలు పై అత్యాచారం !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని వికాసపురి బస్టాండ్ ప్రాంతంలో నివసించే అంధురాలైన  యువతి (20) పొరపాటున సీతాపురి బస్టాప్ లో బస్సు దిగింది. తాను వెళ్లాల్సింది అది కాదని తెలుసుకుని రోడ్డు మీద నిలబడి రోడ్డు దాటించమని స్ధానికులను సహయం కోరింది. ఆ సమయంలో అటు వచ్చిన నిందితుడు (24) ఆమెను రోడ్డు దాటించే పనిలో ఎవరూ తిరగని ఖాళీగా ఉన్న సందులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి పరారయ్యాడు. అక్కడ నుంచి ఎలాగోలా బయటపడిన బాధితురాలు ఆటో ఎక్కి ఇంటికి చేరింది. జరిగిన సంఘటన తల్లి తండ్రులకు చెప్పగానే వారు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఆస్పత్రి నుంచి సమాచారం తెలుసుకున్న దబ్రీ పోలీసులు బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరిచి  సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన చేతన్ ఖన్నాగా గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)