అసోంలో వరద బాధిత ప్రజలను తీసుకెళుతున్న పడవ బోల్తా పడటంతో ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు.అసోం రాష్ట్రం వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ఏడాది అసోంలోని 28 జిల్లాల్లో 18.95 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. హోజాయ్లోని 47 సహాయ శిబిరాల్లో 29,745 మంది ఆశ్రయం పొందారు. హోజాయ్ జిల్లాలో వరద బాధిత ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారని, మరో 21 మందిని రక్షించామని అధికారులు శనివారం తెలిపారు.24 మంది గ్రామస్థుల బృందం శుక్రవారం అర్థరాత్రి ముంపునకు గురైన ఇస్లాంపూర్ గ్రామం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా రైకోటా ప్రాంతంలో పడవ ఇటుక బట్టీని ఢీకొట్టి బోల్తా పడింది. వరదనీటిలో పడిపోయిన వారిలో 21 మందిని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది రక్షించారు. తప్పిపోయిన ముగ్గురు పిల్లలను కనుగొనేందుకు గాలింపు కొనసాగిస్తున్నామని హోజాయ్ డిప్యూటీ కమిషనర్ అనుపమ్ చౌదరి తెలిపారు.ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో చీకట్లో ప్రజలు రిస్క్ తీసుకోవద్దని ఆయన కోరారు.ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని, వారిని ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బోట్లలో తరలిస్తామని ఆయన చెప్పారు.కోపిలి నది వరదనీరు భూములను ముంచెత్తింది.హోజాయ్లో శుక్రవారం జరిగిన ఒక ఘటనలో మరో వ్యక్తి తప్పిపోయారు.సోనిత్పూర్ జిల్లాలో శుక్రవారం నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తుండగా వారిలో ముగ్గురిని రక్షించారు.
వరదల్లో ముగ్గురు పిల్లల గల్లంతు
June 18, 2022
0