జాఫ్రిన్‌ కి ప్రభుత్వ ఉద్యోగం

Telugu Lo Computer
0

 

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫిలింపియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను సీఎం జగన్ అభినందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను శుక్రవారం కిడాంబి శ్రీకాంత్, షేక్‌ జాఫ్రిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ విజయంలో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించడంతో ఆయన్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రశంసించారు. బదిరుల ఒలంపిక్‌ క్రీడల్లో (డెఫిలింపిక్స్‌-2022) కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ కాంస్య పతకం సాధించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్‌ను సీఎం జగన్ ప్రశంసించారు. షేక్‌ జాఫ్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం శ్రీకాంత్, జాఫ్రిన్‌ను సీఎం జగన్ ఘనంగా సన్మానించి, ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ, షేక్‌ జాఫ్రిన్‌ తండ్రి షేక్‌ జకీర్‌ అహ్మద్, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్, శాప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)