టీచర్, ప్రిన్సిపల్ కొట్లాట !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ భేరీలోని మహేంగు ఖేరా గ్రామం ప్రభుత్వ పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ మహిళ టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. ప్రిన్సిపల్ కోపంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా ఎందుకు లేటు వచ్చావంటూ తన బూటు షూతో మహిళ టీచర్ పై దాడి చేశాడు. పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ ఆగకుండా టీచర్ తలపై బూటుతో కొట్టాడు. ఉపాధ్యాయురాలు సైతం ప్రిన్సిపల్ పై దాడి చేసింది. ఈ ఘటన పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్యనే చోటు చేసుకుంది. అక్కడే ఉన్న కొందరు వీరి కొట్లాటను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ స్పందిస్తూ ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని, పలుసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా తనపై దుర్భాషలాడుతుందని తెలిపాడు. ఆమె తనపై తొలుత చేయిచేసుకుందని అందుకే తాను బూటుతో దాడి చేశానని తెలిపాడు. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీకాంత్ పాండే మాట్లాడుతూ.. మహిళ టీచర్ పై దాడి చేసినందుకు ప్రిన్సిపల్ అజిత్ వర్మను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)