సోనియా గాంధీకి కరోనా

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా సోకిందని, ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ట్విటర్‌లో వివరాలు తెలిపారు.''నిన్న సాయంత్రం సోనియా గాంధీ జ్వరం, ఇతర కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో ఆమె వైద్య పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ   వైద్యుల సూచనల మేరకు ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు'' అని చెప్పారు. ''సోనియా గాంధీ గత వారం కాంగ్రెస్ నేతలు, ఉద్యమకారులతో సమావేశాల్లో పాల్గొన్నారు. వారిలో కొందరికి కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కాంగ్రెస్ శ్రేణులు, శ్రేయోభిలాషులు సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ఆరా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే ఉంది.. ఆమె కోలుకుంటున్నారు. ముందుగా మేము ప్రకటించిన దాని ప్రకారమే సోనియా గాంధీ ఈ నెల 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరవుతారు. సోనియా గాంధీ ఆరోగ్యంపై మేము వివరాలు అందిస్తూ ఉంటాం'' అని రణ్‌దీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. కాగా, నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)