ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి పుట్సీల్ గ్రామానికి చెందిన రూపశాంత కుటుంబం సిమిలిగుడలో నెహ్రూనగర్లో అద్దెకు ఉంటున్నారు. జయపురంలోని మహిళ కళాశాలలో ప్లస్టూ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రూప కుమార్తె రచన (19) ఆదివారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తండ్రి మంచి నీరు తాగేందుకు నిద్రలేచి చేసేసరికి చున్నీకి వేలాడుతున్నట్లు గమనించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పొట్టంగి ఎమ్మెల్యే ప్రీతమ్ పాఢి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు మృతదేహాన్ని పరీక్షకు తరలించారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు దృష్ట్యా వివరాలు వెల్లడించలేదు.
Post a Comment
0Comments
3/related/default