జర్మనీలో మోడీకి ఘన స్వాగతం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 26 June 2022

జర్మనీలో మోడీకి ఘన స్వాగతం


శనివారం రాత్రి జీ7 సమ్మిట్ లో పాల్గొనేందుకు జర్మనీకి వెళ్లిన  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి అక్కడి భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఆది, సోమవారాల్లో జరగనున్న జీ7 సమ్మిట్ లో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సులో ఎన్విరాన్ మెంట్, ఎనర్జీ, క్లైమేట్, ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్, కౌంటర్ టెర్రరిజం, జెండర్ ఈక్వాలిటీ, ప్రజాస్వామ్యం అంశాలపై చర్చించనున్నట్లు మోడీ తెలిపారు. జీ7 దేశాధినేతలతో పాటు సదస్సులో పాల్గొంటున్న ఇతర దేశాల లీడర్లతో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ టూర్ లో భాగంగా యూరప్ లో ఉంటున్న మనోళ్లతోనూ సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈసారి జీ7 సమ్మిట్ జర్మనీ ఆధ్వర్యంలో జరుగుతోంది. సదస్సుకు మన దేశంతో పాటు అర్జెంటీనా, ఇండోనేషియా,  సెనెగల్, దక్షిణాఫ్రికాను కూడా ఆహ్వానించింది.

No comments:

Post a Comment