ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం మరో జాతీయ రహదారి మంజూరు చేసింది కేంద్రం. తిరుపతి-పీలేరు జాతీయ రహదారి రెండులేన్ల రహదారి కావడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ మార్గాన్ని నాలుగులేన్ల రహదారిగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాకరాపేట బస్సు రోడ్డు ప్రమాద అనంతరం సీఎం వైఎస్ జగన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం తిరుపతి-పీలేరు జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడానికి పచ్చజెండా ఊపింది. సుమారు రూ.వెయ్యికోట్ల వ్యయంతో పనులను ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే టోపో సర్వేను పూర్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ కి మరో జాతీయ రహదారి మంజూరు
June 05, 2022
0