రూ.50 వేలు ఇస్తేనే మీ కొడుకు శవం ఇస్తాం !

Telugu Lo Computer
0


బీహార్‌లోని సమస్తీపూర్ వయసు మీద పడ్డ భార్యాభర్తలు వీధుల్లో భిక్షాటన చేస్తున్న వీడియో ఇటీవల వెలుగుచూసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా దృష్టికి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు వారి వద్దకు వెళ్లి ఆరా తీయగా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ సిబ్బందికి లంచం ఇచ్చేందుకు భిక్షాటన చేస్తున్నట్లు తెలిపారు. కొన్నాళ్ల క్రితం మా కొడుకు తప్పిపోయాడు. సమస్తీపూర్‌లోని సదర్ ఆసుపత్రిలో అతని శవం ఉన్నట్లు ఇటీవల మాకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి వెళ్లగా అక్కడి సిబ్బంది రూ.50 వేలు లంచం అడిగారు. లంచం ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పారు. మేము పేదవాళ్లం.అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం. అందుకే ఇలా వీధుల్లో భిక్షాటన చేస్తున్నాం.' అని ఆ తండ్రి వాపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో లంచం అడిగిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సమస్తీపూర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. ఇది మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటన అని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. కాగా, సదర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారేనని, వారికి నెలా నెలా సరిగా వేతనాలు ఇవ్వట్లేదని అక్కడి వారు చెబుతున్నారు. వేతనాలు అందకపోవడంతో ఇలా ఆసుపత్రికి వచ్చే వారి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఆ పేద తల్లిదండ్రుల భిక్షాటన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)