ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది. అయితే ఆ బావిలో సగం వరకు నీళ్లు ఉన్నాయి. ఎలాగైనా అందులోనుంచి బయట పడాలని ప్రయత్నించింది. అయినా ఫలితం దక్కలేదు. ఇంతలో దానిని చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు. బావిలో చిరుత ఉన్న ప్రదేశానికి తాడుతో ఉయ్యాలలా కట్టిన ఓ కట్టెను విడిచారు. దీంతో అది ఆ మొద్దుపైకి ఎక్కింది. అనంతరం ఆ కట్టెకు దగ్గరగా పొడవాటి నిచ్చెనను బావిలోకి వదిలారు. దాని సాయంతో పైకివచ్చిన చిరుత వెనక్కి చూడకుండా పరుగులు పెరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బావిలో పడ్డ చిరుత !
June 09, 2022
0