దేశంలో 4,518 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. హోం క్వారంటైన్‌, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 25,782కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06 శాతంగా ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉంది. అలాగే, వారంతపు పాజిటివిటీ రేటు 0.91 శాతంగా ఉంది. కరోనాతో మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,701కు చేరింది. కరోనా నుంచి ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,26,30,852 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 194.12 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)