అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన !

Telugu Lo Computer
0


ముఖేశ్ అంబానీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఎంత ఆర్భాటంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి కాబోయే శ్రీమతి రాధిక మర్చంట్. ఈమె ఇటీవల భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. కాబోయే కోడలి భరతనాట్య ఆరంగేట్రం కోసం అంబానీ ఫ్యామిలీ కదిలి వచ్చింది. భరతనాట్య ప్రదర్శన కోసం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జూన్ 5న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన కార్యక్రమానికి బాలీవుడ్ నటీనటులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంబానీ ఫ్యామిలీతో పాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్ కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు 2019లో నిశ్చితార్థమైంది. అయితే.. కొన్నాళ్లుగా భావన థాకర్‌ వద్ద రాధిక భరతనాట్యంలో శిష్యరికం చేసింది. భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మొదటిసారిగా స్టేజీపై రాధిక నృత్యప్రదర్శన ఇచ్చారు. తనదైన శైలిలో నవరసాలతో ప్రదర్శన ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. కాబోయే కోడలు రాధికతో పాటు అత్త నీతా అంబానీకి కూడా భరతనాట్యంలో ప్రవేశం ఉంది. ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబ సభ్యులందరూ సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. భరతనాట్య ప్రదర్శనకు హాజరైన వారిలో బాలీవుడ్ నటులు సల్మాన్‌ ఖాన్‌, ఆమీర్‌ ఖాన్‌, రణవీర్‌ సింగ్‌ ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)