కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్లో ఆయన సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర.. శనివారమే పదవీ విరమణ చేశారు. 2025 ఫిబ్రవరి వరకు రాజీవ్ సీఈసీగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు 2024లో సార్వత్రిక ఎన్నికలు ఆయన సారథ్యంలోనే జరగనున్నాయి.
సీఈసీగా రాజీవ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
May 16, 2022
0
Tags