కుల్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను హతం

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీర్‌ కుల్గామ్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు. కాగా, ఇందులో ఒకరు పాక్‌కు చెందిన ఉగ్రవాది ఉన్నాడని ఉన్నతాధికారులు తెలిపాయి. ఉగ్రవాదుల సంచారంపై పక్కాగా అందించిన సమాచారం మేరకు.. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో చెయాన్‌ దేవ్‌సర్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు సైతం దాడులను తిప్పికొట్టారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) విజయ్ కుమార్ తెలిపారు. హైదర్‌ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, అనేక నేరాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)