ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రమాదాలకు బ్యాటరీ లోపాలే కారణం !

Telugu Lo Computer
0


ఎలక్ట్రిక్‌ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక ఎండా కాలం సీజన్‌ కారణం కావొచ్చంటూ అనుమానాలు తొలుత వ్యక్తం అయ్యాయి. అయితే కారణం అది కాదని, బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ డీఆర్‌డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్స్‌ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్‌డీవో స్పష్టం చేసింది. అంతేకాకుండా ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్‌ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం ప్రమాదాలకు కారణమైందని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)