జగనన్న విద్యా దీవెన పథకం అనర్హ లబ్ధిదారులకు నోటీసులు

Telugu Lo Computer
0


జగనన్న విద్యా దీవెన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు అనర్హులు తేలారని ప్రకటన చేసింది. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రస్తుత విద్యా సంవత్సరంలో బోధనా రుసుం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు అనర్హులుగా తేలారని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురికి జగన్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని అలాగే, ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారని, తదితర కారణాలతో దరఖాస్తుదారుల పేరుపై అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.. ఇందుకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పంపించారు. ఒక వేళ విద్యార్థులు అందుబాటులో లేని పక్షంలో వారి తల్లిదండ్రులకు నోటీసులు అందించి.. వారి సంతకాలు తీసుకోవాలని అధికారులు ప్రకటన చేశారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)