జమ్మూ కశ్మీర్ లో అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షేక్ అబ్దుల్లా ఫొటోకి బదులు దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని చెక్కనున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ సోమవారమే పంపినట్లు సమాచారం. పోలీస్ సేవా మెడల్పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగించడంపై నేషనల్ కాన్ఫరెన్స్ భగ్గుమంది. ఇది తప్పుడు నిర్ణయమని అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ చరిత్రను చెరిపేయడానికి చేసే ప్రయత్నమని మండిపడింది. కేంద్రం ఎంత ప్రయత్నించినా.. షేక్ అబ్దుల్లా ప్రజల మనస్సుల్లో వుండి పోతారని పేర్కొంది.
షేక్ అబ్దుల్లా ఫొటో తొలగింపు
May 24, 2022
0