పెళ్లి రోజే నూరేళ్లు నిండాయి

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన  రేణుక ఇంటి ఎదురుగా ఉన్న షాపు దగ్గర ఆకు కూరలు తీసుకొని రోడ్డు దాటుతుండగా సెప్టిక్ ట్యాంకర్ ఢీకొంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రేణుక మరణవార్త విని తట్టుకోలేకపోయిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన రేణుకకు 9 సంవత్సరాల క్రితం తొండ గ్రామానికి చెందిన లోడె శేఖర్‌తో వివాహం జరిగింది. రేణుకకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వివాహం జరిగి 9 సంవత్సరాలు పూర్తి కావడంతో కుటుంబ సభ్యులు రేణుకతో పాటు అందరూ కలిసి యాదగిరిగుట్ట లక్ష్మినరసింహస్వామి దర్శనానికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగనే త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకునే క్రమంలో దుర్ఘటన జరగడం స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది. వివాహం జరిగి పదో ఏట అడుగుపెడుతున్న వివాహితకు నిండు నూరేళ్లు నిండిపోవడంతో భర్త, ఇద్దరు కుమార్తెలు బోరున విలపించారు. అప్పటి వరకు సరదాగా, సందడిగా ఉన్న ఇల్లు కాస్తా రేణుక మరణంతో విషాదం నెలకొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)