పరుపుకోసం యాజమానితో ఏనుగు పిల్ల గొడవ!

Telugu Lo Computer
0

 

నిద్రిస్తున్న యాజమానిని పరుపుపై నుంచి అమాంతం నెట్టేసి, ఏం చక్కా పరుపెక్కి పడుకుంది.. ఏనుగు పిల్ల చేష్టలతో కడుపుబ్బా నవ్విన యాజమాని చివరికి అదే పరుపుపై పడుకున్నాడు. ఎంతో నవ్వును తెప్పించిన ఈ ఏనుగు పిల్ల గొడవ సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఏనుగులు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయంటారు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో ఏనుగు పిల్ల చేసిన అల్లరి చూస్తే అది నిజమే అనాల్సిందే. ఏనుగు పిల్లకు, అతని యాజమానికి మధ్య జరిగిన గొడవ వీడియోను భారతీయ అటవీ అధికారి డాక్టర్ సామ్రాట్ గౌడ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ వీడియోను ఈ నెల 10న పోస్టు చేయగా, ఇప్పటి వరకు లక్ష మందికిపైగా వీక్షించారు. అయితే ఈ వీడియోకు సామ్రాట్ గౌడ.. "హే దట్స్ మై బెడ్..గెట్ అప్.." అనే క్యాప్షన్‌తో ఇచ్చారు. ఏనుగు పిల్ల పాకలో దారికి అడ్డంగా పెట్టిన గేట్లను దాటుకొని వచ్చే దగ్గర నుంచి యాజమానిని పరుపుపై నుంచి లేపి.. తాను పడుకొనే సన్నివేశం వరకు ఈ వీడియోలో చిత్రీకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)