ప్రముఖ నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూత

Telugu Lo Computer
0


తెలుగు చిత్ర సీమ నిర్మాతల్లో ఒకరైన సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు కన్నుమూశారు.  అక్కినేని నాగేశ్వరరావు 'రాగదీపం', ఏయన్నార్, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావు తో 'పోలీస్ వెంకటస్వామి' వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తో పాటు మరి కొన్ని చిత్రాలు ప్రొడ్యూస్ చేసిన బోసుబాబు గుండెపోటుతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దర్శక రత్న దాసరి నారాయణరావుకు దూరపు బంధువు అయిన బోసుబాబు (66) ఇక లేరనే విషయం తెలుసుకుని సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. దాసరి పద్మకు సోదరుడి వరుస అయిన బోసుబాబు. దాసరి చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశారు. దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ఆయన నిర్మాతగా మారారు.

Post a Comment

0Comments

Post a Comment (0)