ప్రశాంత్ కిశోర్ సొంత పార్టీ ?

Telugu Lo Computer
0


మరో రెండేళ్లల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార భాజపాను గద్దె దించేందుకు ఓ వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనలు చేస్తుంటే, మూడో కూటమి ఏర్పడొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి ఇరు పక్షాలు (కాంగ్రెస్, కాంగ్రెసేతర కూటమి) ఎన్నికల ప్రణాళికపై చర్చలు జరిపారు. పీకే సంస్థ ఐప్యాక్ సేవలను వినియోగించుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇంతలోనే ప్రశాంత్ కిశోర్ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు వ్యూహకర్తగానే ఆయా పార్టీలకు పనిచేసిన పీకే ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ప్రశాంత్ కిశోర్ జాతీయ స్థాయిలో సొంతంగా పార్టీ పెట్టె యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈమేరకు ఆదివారం బీహార్‌లో భావసారూప్య పార్టీలతో పీకే చర్చలు కూడా జరిపారు. అయితే ఉన్నట్టుండి ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడంపై విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చడానికే ఇలా పార్టీ పెడుతున్నారంటూ కూడా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)