దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు, 26 మరణాలు నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 19వేల 500 యాక్టివ్ కేసులుండగా, పాజిటీవ్ రేటు  0.05 శాతంగా వుంది. ఇప్పటివరకూ 4కోట్ల 30లక్షల 82వేల 345 కేసులు నమోదు కాగా, వాటిలో 5 లక్షల 23వేల 869 మరణాలు నమోదయ్యాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఆదివారం ఒక్కరోజులో 2723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా ప్రభావం నుంచి మొత్తంగా 4కోట్ల 25లక్షల 38 వేల 976 మంది కోలుకున్నారు. 472 రోజులుగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 189.23 కోట్ల డోసులను అందజేశారు. ఆదివారం ఒక్కరోజు 4లక్షల 2వేల 170 డోసుల టీకాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 189కోట్ల 23లక్షల 98వేల 347 డోసుల టీకాలు అందజేశామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)