ఉత్తరప్రదేశ్లోని మధురలో శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్ప్రెస్ వేపై మధుర వద్ద వ్యాగనార్ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను చాలా కష్టంగా కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో చిన్నారి సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. నోయిడాలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
యుమున ఎక్స్ప్రెస్ హైవే ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
May 07, 2022
0
Tags